Raghunandan Rao: ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Raghunandan Rao Demanding CBI Enquiry On ORR Tollgate: ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై బీజేపీ చాలారోజులుగా ప్రశ్నిస్తోందని, అయితే ఇటీవల బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని కొందరు విమర్శిస్తున్నారని, తమకు ఎవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదని చురకలంటించారు. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని, ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచండం లేదని ఆయన ప్రశ్నించారు.
MLA Vivekananda: కేటీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
7200 కోట్ల నుంచి 7380 కోట్లకు ఓఅర్ఆర్ టెండర్ విలువ పెంచింది ఎవరో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. ఒక దర్యాప్తు సంస్థ దీనిపై విచారణ జరుపుతోందని వెల్లడించారు. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని, అలాంటి సంస్థకు టెండర్ను రద్దు చేయాలని కోరారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పినప్పుడు.. నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్ఎండీఏ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని అడిగిన ఆయన.. టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సీబీఐ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఐఆర్బీ ఎక్కడిది? ఆ సంస్థ ఎవరిది? ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు సీఎం స్పందించడం లేదు? ఓఆర్ఆర్ టోల్ గేట్పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్కు టైం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
అంతకుముందు కూడా.. కవిత, కేటీఆర్ తమ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ను ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని అన్నారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే.. ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని అడిగారు. దీని వెనుక ఏదో మతలబు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!