MLA Vivekananda: కేటీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Vivekananda Strong Counters To Revanth Reddy: ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని, కేవలం మంత్రి కేటీఆర్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. అసలు ORR బిడ్డింగ్పై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని.. గాలి వార్తను బేస్ చేసుకోని ఆరోపణలు చేశారని అన్నారు. 10శాతం నిధులు కట్టాలని కేటీఆర్ ఒత్తిడి చేసారనే వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని, నాలుగు పైసలు వెనుకేసుకోవాలని అన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడడని, మతిస్థిమితం కోల్పోయి అతడు వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Amit Shah: కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి అమిత్ షా.. శాంతి కోసం రెండు వర్గాలతో చర్చలు..
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ORR బిడ్డింగ్పై ఏ విచారణకు అయినా తాము సిద్ధమేనంటూ వివేకానంద సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి గండం వచ్చిందని, పీసీసీ పదవి నుంచి రేవంత్ను తొలగించేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆ భయంతోనే.. తన పీసీసీ పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ నిరాధారమైణ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 111జీవో ఎత్తివేయాలని లోకల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీర్మానాలు చేశారని.. మరి వాళ్లనను కూడా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేయొద్దని, ఆ జీవో ఉండాలని.. ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉందా? అని నిలదీశారు. రఘునందన్ రావుకు దమ్ముంటే విచారణ చేయించాలని వివేకానంద ఛాలెంజ్ చేశారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
కాగా.. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లందరూ ఆ భూములు కొన్నాకే జీవోను ఎత్తివేస్తూ ఉత్తర్వులు తెచ్చారని ఆరోపించారు. అంతేకాదు.. ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, రూ. లక్ష కోట్ల విలువైన ఈ కుట్రకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయని, ఈ వ్యవహారానికి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు అర్వింద్ కుమార్లు సహకరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివేకానంద పై విధంగా ఘాటుగా స్పందించారు.
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?