MLA Vivekananda: కేటీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Vivekananda Strong Counters To Revanth Reddy: ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని, కేవలం మంత్రి కేటీఆర్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. అసలు ORR బిడ్డింగ్పై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని.. గాలి వార్తను బేస్ చేసుకోని ఆరోపణలు చేశారని అన్నారు. 10శాతం నిధులు కట్టాలని కేటీఆర్ ఒత్తిడి చేసారనే వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని, నాలుగు పైసలు వెనుకేసుకోవాలని అన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడడని, మతిస్థిమితం కోల్పోయి అతడు వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Amit Shah: కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి అమిత్ షా.. శాంతి కోసం రెండు వర్గాలతో చర్చలు..
Also Read
ORR బిడ్డింగ్పై ఏ విచారణకు అయినా తాము సిద్ధమేనంటూ వివేకానంద సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి గండం వచ్చిందని, పీసీసీ పదవి నుంచి రేవంత్ను తొలగించేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆ భయంతోనే.. తన పీసీసీ పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ నిరాధారమైణ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 111జీవో ఎత్తివేయాలని లోకల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీర్మానాలు చేశారని.. మరి వాళ్లనను కూడా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేయొద్దని, ఆ జీవో ఉండాలని.. ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉందా? అని నిలదీశారు. రఘునందన్ రావుకు దమ్ముంటే విచారణ చేయించాలని వివేకానంద ఛాలెంజ్ చేశారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
కాగా.. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లందరూ ఆ భూములు కొన్నాకే జీవోను ఎత్తివేస్తూ ఉత్తర్వులు తెచ్చారని ఆరోపించారు. అంతేకాదు.. ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, రూ. లక్ష కోట్ల విలువైన ఈ కుట్రకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయని, ఈ వ్యవహారానికి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు అర్వింద్ కుమార్లు సహకరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివేకానంద పై విధంగా ఘాటుగా స్పందించారు.
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!