Etela Rajender: భయంతో పీకేని తెచ్చుకున్నారు.. మీ ఓటమిని ఆపలేమని ఆయనే చెప్పాడట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ నటుడు ప్రకాష్రాజ్తో కలిసి పీకే పర్యటించారు.. అయితే, ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ను తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అయితే, మీ (టీఆర్ఎస్ పార్టీ) ఓటమిని ఎవరూ ఆపలేరని పీకేనే చెప్పాడట అని వ్యాఖ్యానించారు. ఇక, రైతులతో చెలగాటం ఆటలాడితే మాడి మసి అయిపోతావ్ అంటూ కేసీఆర్పై ఫైర్ అయ్యారు ఈటల… ఐటీలు, పరిశ్రమలున్న అత్యధిక ప్రజలు నివసించేది గ్రామాల్లోనేనని.. వరి చేయకూడదని హుకుం జారీ చేస్తే రైతాంగం బిక్కు బిక్కు మంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: YS Sharmila: రైతులను బెదిరిస్తున్నారు.. మనం ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నామా..?
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
మరోవైపు, పౌల్ట్రీ రైతాంగానికి మక్కలు దొరకడం లేదన్నారు ఈటల… సీఎం కేసీఆర్కి విజన్ లేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని రుణమాఫీ, రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నావా? అని నిలదీశారు.. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తుచేసిన ఆయన.. రైతాంగాన్ని అయోమయంలో పడవేస్తున్నారని మండిపడ్డారు.. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు, పబ్ల ద్వారా 37 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని.. వడ్లు కొంటె వచ్చే నష్టం 8 వందల కోట్లు మాత్రమే అన్నారు ఈటల రాజేందర్.. ఇక, తక్షణమే లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని.. చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్తల మీటింగ్ పెట్టి.. ఏ పంటలు వేయాలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆయన.. రాష్ట్రంలో మార్పు రాబోతోంది.. ఏ మార్పు జరిగిన అది కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభమవుతుందంటూ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..