Goshamahal: రాజా సింగ్ సస్పెన్షన్ పై గందరగోళం.. ముఖేష్ గౌడ్ కమారుడికి గోషామహల్ టికెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goshamahal: రాజాసింగ్ను పార్టీ అధిష్టానం బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్ సొంతంగా ముందుకు సాగుతున్న.. సస్పెన్షన్ సమస్య అలాగే ఉంది. అయితే కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో యువ నేత… శరవేగంగా పావులు కదుపుతున్నారు వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ సీనియర్ నేతతో చర్చలు జరగడం, ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఫలితంగా గోషామహల్ లో అసలేం జరుగుతోంది…? ఏమి జరగబోతున్నది..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా.. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు రాజా సింగ్ను బీజేపీ నాయకత్వం గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ఆయన బయటకు వచ్చారు. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని అందరూ భావించారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. చాలాసార్లు బహిరంగంగా తొలగించాలని కోరారు. త్వరలో ఎత్తివేసే అవకాశం కూడా ఉందని రాష్ట్ర ముఖ్య నేతలు చెబుతున్నారు. కట్ చేస్తే… రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ అలాగే ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన… నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ మారే విషయమై చర్చ జరుగుతుండగా… అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. ఈ స్థానంలో బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ పోటీ చేశారు. గోషామహల్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా విక్రమ్ గౌడ్ కూడా చాలా రోజులు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత బీజేపీలో చేరారు. తనకంటూ ఓ వర్గం ఉంది. ఈ సీటును ఆశిస్తున్నప్పటికీ… రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానం నుంచి రాజాసింగ్ రెండుసార్లు గెలిచారు. దీంతో మరోసారి బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే సస్పెండ్ కావడం, ఇప్పటి వరకు తొలగించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో… విక్రమ్ గౌడ్ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను కలిశారు, ఆపై విక్రమ్ గౌడ్ను కలిశారు.
Also Read
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
తాజా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈటల మీడియాతో మాట్లాడకపోయినా… ఆ తర్వాత విక్రమ్ గౌడ్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాజాసింగ్కు మద్దతు ఇవ్వాలని కోరినట్లు… ఆయనపై విధించిన సస్పెన్షన్ రాష్ట్ర పార్టీ పరిధిలోనిది కాదన్నారు. జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిణామాలపై రాజాసింగ్ నోరు మెదపడం లేదు. టికెట్ విషయంలో విక్రమ్ గౌడ్ నుంచి స్పందన రాగా.. రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఎలా ముందుకెళ్లబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ గౌడ్ నిజంగా అవకాశం ఇస్తారా..? రాజాసింగ్ గురించి మరోలా ఆలోచిస్తున్నారా? చూడాలి మరి…!
Khalistani terrorist : ఇండియాకు ఖలిస్థానీ టెర్రరిస్ట్ హెచ్చరిక.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!