తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని… గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి? అని నిలదీశారు. అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని మీ సీఎం కెసిఆర్ ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలన్నారు. ఈ విషయమై ప్రజలు ఉద్యమాలకు తప్పక సమాయత్తమవుతారని… ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? అని ప్రశ్నించారు. ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్కే రాని సీఎం కెసిఆర్ కు కొత్త భవనాలెందుకు? అని నిలదీశారు.