Telangana Bjp: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి.
దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు.. తరచూ నేతలు రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. తెలంగాణ లో పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష చేస్తున్నారు. ఓవైపు భరోసా ఇస్తూనే… కొత్తవారిని పార్టీలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. మే నెలలోనే మోడీ సహా ముగ్గురు ముఖ్య నేతలు రాష్ట్రానికి వచ్చారు.
Also Read
- Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
మరోవైపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్లోనే పెట్టాలని దాదాపు నిర్ణయించింది హైకమాండ్. రాష్ట్ర బిజెపికి సంకేతాలు కూడా ఇచ్చింది. దీంతో సమావేశాల వేదిక పై ఇక్కడి నేతలు చర్చిస్తున్నారు. హైటెక్స్ తో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర్లో ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
ప్రధానితో పాటు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు అవుతారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి.. ఇప్పటినుంచే కసరత్తు మొదలైంది. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగితే బిజెపి కి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. దీనిపై వారం పది రోజుల్లో పూర్తి క్లారిటీ రాసుంది. మరో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రెడీ అవుతున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రెండు మార్లు చేసిన యాత్ర సక్సెస్ కావడంతో మరోసారి జనంలోకి వెళ్ళి టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. మూడోసారి యాత్రపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, పార్టీలోకి చేరేవారిని వెంటనే చేర్చుకోవాలని ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
Srinidhi Shetty: ‘నాకు డబ్బే ముఖ్యం’ అంటూ బాంబ్ పేల్చేసిందిగా
తాజావార్తలు
-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
-
Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్పై అన్నామలై ఫైర్
-
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
-
Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
-
Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!