Cold Wave: రాష్ట్రాల్లో పెరిగిన చలి.. కురుస్తున్న పొగమంచు
Cold Wave Telangana: తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. దీంతో తెలంగాణ, ఏపీ నగరవాసులు గజగజ వణికి పోతున్నారు. శీతకాలం ప్రవేశంతోనే చలి సైతం విజృభింస్తుండడంతో నగరవాసులు హడలి పోతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో క్రమంగా చలితీవ్రత పెరుగుతుండడంతో నగరవాసులు ఆక్టోబర్ చివరి వారంలో నగరంలో ఒక్కసారిగా పెరిగిన చలితో తీవ్రతతో ప్రజలు వణికిపోయారు. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈనెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది. ఇక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్టోబర్ తోవర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరిగటం మొదలైంది. తాజాగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్న సాయంత్రం దాటితే చాలు చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. హైదరాబాద్ నగరంలోనూ చలి ఎక్కువగానే ఉంది. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాగ్యనగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉన్నందున రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజన్సీ ప్రాంతాల్లో చలికి జనాలు వణికిపోతున్నారు. కొమురం భీం జిల్లా లో 9.6, మంచిర్యాల జిల్లాలో 9.9.డిగ్రీలు గా నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 10.5, నిర్మల్ జిల్లా లో 10.9 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు. దీంతో.. కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ కోడ్ హెచ్చరిక జారీ చేశారు. ఈ జిల్లాల్లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత ఒకే అంకెను తాకవచ్చు. ఇదిలా ఉండగా, గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున హైదరాబాద్కు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
నగరంలో బుధవారం నాటి కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్, 2012లో నమోదు చేయబడిన 12.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంది. గత 24 గంటల్లో రాజేంద్రనగర్లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి, ఆ తర్వాత సరూర్నగర్ (12.4 డిగ్రీల సెల్సియస్), సికింద్రాబాద్ (12.6 డిగ్రీల సెల్సియస్), రామచంద్రపురం, పటాన్చెరు (12.8 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాదరసం దాని అధోముఖ ధోరణిని కొనసాగించడంతో కొన్ని జిల్లాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మంచిర్యాలు, రంగారెడ్డి, నిజామాబాద్లో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. అయితే ఈచలి వాతావరణం ఇంకా మరో మూడు రోజులు కొనసాగుతుందని అంటున్నారు.
ఇక ఏపీలో తిరుమలలో వర్షంతోపాటు చలితీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తులు టీటీడీ పీఏసీలు, షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దట్టమైన పొగమంచు చిరు జల్లుల మధ్యభక్తులు వణికిపోతున్నారు. విశాఖ మన్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధానిలో ఉదయం వేళల్లో పొగమంచు లేదా పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి సమయంలో 14 డిగ్రీల సెల్సియస్గా ఉంటాయని బులెటిన్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!