భాగ్యనగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గే అవకాశం ఉన్నందున రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై చలి పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి టి లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బేలాలో 7.8 డిగ్రీలుగా వుంది. చెప్రాలలో 8డిగ్రీలుగా వుంది. నిర్మల్ జిల్లా తానూర్ లో 7.2 డిగ్రీల సెల్షియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పెంబిలో 8.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు కావడంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా…
గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర,…
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు…