Bhatti Vikramarka: అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని భట్టి వివరించారు. ఈశాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని తెలిపారు.. ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యాంగ తీర్చిదిద్దే ప్రణాళికలు మీ శాఖ నుంచే పుట్టుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులకు ఉద్బోధించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో కలిసి ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక శాఖ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తయారు చేసే ప్రణాళికలు, సేకరించే గణాంకాల వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి భట్టి విక్రమార్కకి వివరించారు.
Read also: CM Mamata Banerjee : బెంగాల్ దేశాన్ని నడిపిస్తుంది : సీఎం మమతా బెనర్జీ
Also Read
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ కీలకమన్నారు. ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయన్నారు. గణాంకాలను ఢాంభీకాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును అమలు చేసే సంక్షేమ పథకాల సరళిని లెక్కలు కట్టే ప్రణాళిక శాఖ నివేదికలు తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని వివరించారు. ఈశాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. జంట నగరాల్లో 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెరువులు అన్యా క్రాంతమయ్యాయి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏంటి అన్నదానిపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Rinku Singh Six: రింకూ సింగ్ పవర్ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్
తాజావార్తలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!