Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామంలో భట్టి ప్రచారం నిర్వహించారు. రైతు బంధుకు ఈసీ ఆంక్షలు విధించడం.. కేసీఆర్ తీరుపై భట్టి స్పందించారు. రైతు బంధు ఇప్పుడు మొదలు పెట్టింది కాదని అన్నారు. నోటిఫికేషన్ వస్తే రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతు బంధు నిధులు ఎందుకివ్వలేదు..? అని ప్రశ్నించారు. రైతు బంధు నిధుల విషయంలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎందురు ఆగారు..? అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ముందే రైతు బంధు నిధులు వచ్చుంటే రైతులకు ఆ డబ్బులు చేరేవి కదా..? అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. తొలి కెబినెట్ లోనే గ్యారెెంటీలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
మధిర పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిన్న కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్కు ప్రజాశక్తిపై విశ్వాసం ఉండగా బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల్లో కరెన్సీ నోట్ల మూటలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు.. వచ్చే ఐదేళ్లు దోచుకునేందుకు ఈ ఎన్నికల్లో డబ్బు వృథా చేశారని ఆరోపించారు. ప్రజలు దీనిపై దృష్టి సారించి బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మదీరా నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్య సంస్థల ఏర్పాటుపై చర్చ జరిగింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న భట్టి విక్రమార్కకు వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కి మధిర నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు , ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపారం గ్రామంలో ఘన స్వాగతం పలికారు. వేలాది వాహనాలతో ర్యాలీ బనిగందలపాడు, ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మధిర, ఆత్కూరు క్రాస్ రోడ్డు, బోనకల్ క్రాస్ రోడ్డు మీదుగా ఆత్కూరు, కలకోట సిరిపురం గ్రామాల మీదుగా గుంటుపల్లి గోపారం చేరుకుంది. అక్కడి నుంచి ఈ బైక్ ర్యాలీ వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?
తాజావార్తలు
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!