Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామంలో భట్టి ప్రచారం నిర్వహించారు. రైతు బంధుకు ఈసీ ఆంక్షలు విధించడం.. కేసీఆర్ తీరుపై భట్టి స్పందించారు. రైతు బంధు ఇప్పుడు మొదలు పెట్టింది కాదని అన్నారు. నోటిఫికేషన్ వస్తే రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతు బంధు నిధులు ఎందుకివ్వలేదు..? అని ప్రశ్నించారు. రైతు బంధు నిధుల విషయంలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎందురు ఆగారు..? అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ముందే రైతు బంధు నిధులు వచ్చుంటే రైతులకు ఆ డబ్బులు చేరేవి కదా..? అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. తొలి కెబినెట్ లోనే గ్యారెెంటీలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమి.. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
మధిర పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిన్న కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్కు ప్రజాశక్తిపై విశ్వాసం ఉండగా బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల్లో కరెన్సీ నోట్ల మూటలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు.. వచ్చే ఐదేళ్లు దోచుకునేందుకు ఈ ఎన్నికల్లో డబ్బు వృథా చేశారని ఆరోపించారు. ప్రజలు దీనిపై దృష్టి సారించి బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మదీరా నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్య సంస్థల ఏర్పాటుపై చర్చ జరిగింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న భట్టి విక్రమార్కకు వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కి మధిర నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు , ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపారం గ్రామంలో ఘన స్వాగతం పలికారు. వేలాది వాహనాలతో ర్యాలీ బనిగందలపాడు, ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మధిర, ఆత్కూరు క్రాస్ రోడ్డు, బోనకల్ క్రాస్ రోడ్డు మీదుగా ఆత్కూరు, కలకోట సిరిపురం గ్రామాల మీదుగా గుంటుపల్లి గోపారం చేరుకుంది. అక్కడి నుంచి ఈ బైక్ ర్యాలీ వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!