Bhatti Vikramarka : ‘తోలు వలిచే’ సంస్కృతి మాది కాదు.. ప్రజాస్వామ్యమే మా బాట
- కేసీఆర్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల స్పష్టమైన తీర్పు
- ‘తోలు వలుస్తాం’ వ్యాఖ్యలను ఖండించిన భట్టి
- సభకు రాని ప్రతిపక్షాలపై ప్రజాస్వామ్య హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీని కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దీవించలేదు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల పక్షాన నిలబడటం వల్లే ప్రజలు స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇస్తున్నారు” అని ఆయన వివరించారు. ముఖ్యంగా 65 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
కేసీఆర్ చేసిన “తోలు వలుస్తాం” అనే వ్యాఖ్యలను భట్టి తీవ్రంగా ఖండించారు. “తోలు తీసుకునే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు కేసీఆర్? పదిమందిని కూర్చోబెట్టుకొని తోలు వలుస్తానంటే ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడినా, మేము మాత్రం దిగజారి ప్రవర్తించము. మా అభివృద్ధి చాటల ద్వారానే మీకు సమాధానం చెబుతాం” అని భట్టి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభకు వచ్చే ధైర్యం లేకనే బయట ఉండి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
గతంలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా తేడా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా, పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని, అందుకు ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మద్దతు ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను ప్రజలు ఇచ్చారని, ఇప్పటికైనా కేసీఆర్ తన ధోరణి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి, విమర్శలకే పరిమితం కావడం ప్రతిపక్షాలకు తగదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Anantapur: కసాయి తండ్రి కిరాతకం.. ఇద్దరు కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేత.. చివరకు..?
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!