Bhadradri Kothagudem: గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి పోడు సాగుపై అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేశారు. గిరిజన మహిళలపై బెల్ట్ తో అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు చేసుకుంటున్న గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ తో దాడి చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం అయిన సందర్భంలో అధికారులు వీరిని అడ్డుకునేందుకు దాడులు చేశారు.
ప్రస్తుతం గిరిజనులు, అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. పోడు భూముల వివాదం భద్రాద్రి జిల్లాలోని చందుగొండ, ముల్కల పల్లిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒడిశా, చత్తీస్ గఢ్ నుంచి 30 ఏళ్ల క్రితం వచ్చిన గిరిజనులు నివాసం ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే దీన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే బెల్ట్ తో ఫారెస్ట్ అధికారులు మహిళలపై దాడులు చేయడం కాస్త వివాదాస్పదం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు, భూపాలపల్లి, కుమ్రం భీం జిల్లాల్లో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉంది.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!