Bhadradri Kothagudem: గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి పోడు సాగుపై అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేశారు. గిరిజన మహిళలపై బెల్ట్ తో అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు చేసుకుంటున్న గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ తో దాడి చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం అయిన సందర్భంలో అధికారులు వీరిని అడ్డుకునేందుకు దాడులు చేశారు.
ప్రస్తుతం గిరిజనులు, అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు. పోడు భూముల వివాదం భద్రాద్రి జిల్లాలోని చందుగొండ, ముల్కల పల్లిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒడిశా, చత్తీస్ గఢ్ నుంచి 30 ఏళ్ల క్రితం వచ్చిన గిరిజనులు నివాసం ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే దీన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే బెల్ట్ తో ఫారెస్ట్ అధికారులు మహిళలపై దాడులు చేయడం కాస్త వివాదాస్పదం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు, భూపాలపల్లి, కుమ్రం భీం జిల్లాల్లో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!