Hyderabad Crime: అర్థరాత్రి యాచకులపై దాడి.. గొంతు కోసి హత్య
Hyderabad Crime: సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ బిచ్చగాడిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. దుండగులు బిచ్చగాళ్ల నుంచి డబ్బు ఎత్తుకెళ్లారు. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో మధ్యం మత్తులో యాచకుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసేందుకు దారి తీసింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యచకుల మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు యాచకులు కలిసి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో నరికి చంపారు. అంతటితో ఆగకుండా మారేడ్పల్లిలో దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో పొడిచారు.. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి హత్యకు పాల్పడ్డ ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
ఘటనకు కారకులైన ముగ్గురు సైకో కిల్లర్ ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఒక యాచకుడు మృతి చెందగా, మరో యాచకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే యాచకుల వద్ద డబ్బు దోచుకునేందుకే హత్య ప్లాన్ వేసుకుని వారిపై దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడే వున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో యాచకులపై ఎందుకు దాడి చేశారనేది ఇంకా తెలియరాలేదు. అయితే వారిపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా ప్లాన్ వేసుకుని వారిపై కత్తితో దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!