NTV Telugu Site icon

Hyderabad Crime: అర్థరాత్రి యాచ‌కుల‌పై దాడి.. గొంతు కోసి హత్య

Secendrabad Crime

Secendrabad Crime

Hyderabad Crime: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ బిచ్చగాడిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. దుండగులు బిచ్చగాళ్ల నుంచి డబ్బు ఎత్తుకెళ్లారు. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో మధ్యం మత్తులో యాచకుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసేందుకు దారి తీసింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యచకుల మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు యాచకులు కలిసి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో నరికి చంపారు. అంతటితో ఆగకుండా మారేడ్పల్లిలో దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో పొడిచారు.. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి హత్యకు పాల్పడ్డ ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు కారకులైన ముగ్గురు సైకో కిల్లర్ ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఒక యాచకుడు మృతి చెందగా, మరో యాచకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే యాచకుల వద్ద డబ్బు దోచుకునేందుకే హత్య ప్లాన్ వేసుకుని వారిపై దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడే వున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో యాచకులపై ఎందుకు దాడి చేశారనేది ఇంకా తెలియరాలేదు. అయితే వారిపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా ప్లాన్ వేసుకుని వారిపై కత్తితో దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌!