Hyderabad Crime: అర్థరాత్రి యాచకులపై దాడి.. గొంతు కోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ బిచ్చగాడిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. దుండగులు బిచ్చగాళ్ల నుంచి డబ్బు ఎత్తుకెళ్లారు. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో మధ్యం మత్తులో యాచకుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసేందుకు దారి తీసింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యచకుల మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు యాచకులు కలిసి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో నరికి చంపారు. అంతటితో ఆగకుండా మారేడ్పల్లిలో దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో పొడిచారు.. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి హత్యకు పాల్పడ్డ ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
ఘటనకు కారకులైన ముగ్గురు సైకో కిల్లర్ ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఒక యాచకుడు మృతి చెందగా, మరో యాచకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే యాచకుల వద్ద డబ్బు దోచుకునేందుకే హత్య ప్లాన్ వేసుకుని వారిపై దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడే వున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో యాచకులపై ఎందుకు దాడి చేశారనేది ఇంకా తెలియరాలేదు. అయితే వారిపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా ప్లాన్ వేసుకుని వారిపై కత్తితో దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!