Bandi Sanjay: ట్విట్టర్ టిల్లూ నన్ను కెలికితే ఊరుకుంటానా.. అంతకు మించి సినిమా చూపిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandisanjay satire on KTR: కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నాడు నేను ఊరుకుంటనా అంతకంటే ఎక్కువ కెలుకుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. నామీద 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెట్టారని అన్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం కొంపల్లిలో జరుగిన ‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’లో బండి సంజయ్ మాట్లాడుతూ.. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ బిడ్డ మీద ఈడీ, సీబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు…. మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కవిత మహిళా బిల్లుపై చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ సారా దందావల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే దుస్థితి ఏర్పడింది అన్నారు. తెలంగాణ వచ్చినాక ఏం ఒరిగింది? 2014కు ముందు మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తే… కేసీఆర్ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి రూ.40 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నరు. అయినా తెలంగాణ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
కోవిడ్ తో ప్రపంచమంతా అల్లకల్లోలమైన సమయంలో భారత్ మాత్రం స్థిరంగా ఉంటూ ఆర్దికంగా 5వ స్థానంలో నిలిచిందన్నారు. 2047 నాటికి నెంబర్ వన్ స్థానానికి చేరుకోబోతోందని అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ప్రాణాలు నిలిపిన ఘనత మోదీదే తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలిస్తే… కేసీఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగమని ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేన్నారు. దళిత బంధు, రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి హామీలు అమలు చేయలేదన్నారు. చివరకు ఫస్ట్ నాడు కూడా జీతాలు ఇయ్యలేని దుస్థితి ఏర్పడిందన్నారు. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో కేసీఆర్ ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచి చూపించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం… 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తామన్నారు. 317 జీవోను సవరించాలని నేను దీక్ష చేస్తే నా ఆఫీస్ ను గ్యాస్ కట్టర్లు పెట్టి ధ్వంసం చేశారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
మాపై దాడులు చేశారు. లాఠీఛార్జ్ చేశారు. జైల్లో వేశారు. అయినా ఏ ఉపాధ్యాయ సంఘం కూడా కేసీఆర్ కు భయపడి కనీసం మద్దతివ్వలేదని. అయినా మేం భయపడలేదు. మేం టీచర్ల పక్షాన కొట్లాడిన్నామన్నారు బండి సంజయ్. ఈరోజు 317 జీవో వల్ల టీచర్లు, ఉద్యోగులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందంటే… అది బీజేపీ చేసిన పోరాటాలవల్లనే. రైతులు, నిరుద్యోగులు, దళిత, గిరిజనుల పక్షాన నిరంతరం ఉద్యమిస్తూ జైలుకు పోతున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పులన్నీ తీరాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీయే రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తేనే సాధ్యం. పొరపాటున మళ్లీ కేసీఆర్ గెలిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అడుక్కునే తినే దుస్థితికి తీసుకొస్తాడన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేబినెట్ లో ఎందుకు చర్చ జరగలేదని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. డీఏలు ఎందుకు ఇవ్వడం లేదు? ఫస్ట్ తారీఖున జీతాలెందుకు ఇవ్వడం లేదని ఎన్జీవో నాయకులు ఎందుకు అడగడం లేదు? కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ… కేసీఆర్ పెట్టే విందు భోజనాలకు తలొగ్గి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి కేసీఆర్ చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇవ్వండి. బీజేపీకి ఒక్క అవకాశమివ్వండని బండి సంజయ్ కోరారు.
Bandi sanjay: ఒక్క ఛాన్స్.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!