Site icon NTV Telugu

Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పార్టీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు అప్పగించింది.
ఈనేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

Read also: Mukesh Kumar Debut: వికెట్ ఏమీ పడగొట్టకున్నా.. రెండో భారత ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ అరుదైన రికార్డు!

కాగా బండి సంజయ్ హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు, బండి అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి జయతి విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఎస్ఆర్ క్లాసిక్ గార్డెన్స్‌కు వెళతారు. సాయంత్రం శంషాబాద్‌లోని ఎస్సార్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో బండి మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళిక రచించడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ లక్ష్యంలో భాగంగా, పార్టీలో సంస్థాగత మార్పులు ప్రారంభించబడ్డాయి, ఇది అనేక రాష్ట్రాలలో అధ్యక్షులను భర్తీ చేయడానికి దారితీసింది. ఏపీ రాజకీయాల్లోనూ బండి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

బండి సంజయ్ నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహంతో బీజేపీ నాయకత్వం ముందుకు సాగనుంది. ఈ మేరకు పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చారు. తెలంగాణ, ఏపీ సహా మరో రెండు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఈ ఏడాది జూలై నెలలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది భాజపా అధ్యక్షులతో సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీ విస్తరణ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దక్షిణాదిలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎంపీ సీట్లు దక్కించుకోవడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.

Game Changer: ఇండిపెండెన్స్ డే రోజైనా టీజర్ రిలీజ్ చేస్తారా?

Exit mobile version