Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఇవాల ఉదయం జిల్లాలోని 57వ డివిజన్ లో బండి సంజయ్ పర్యటించారు. మోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు కట్టుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అన్నారు. ‘‘నేను బీఆర్ఎస్ మద్దతుతో గెలిస్తే.. రేవంత్రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారు? అతను అడిగాడు. పొన్నం ప్రభాకర్కు అసలు డిపాజిట్ వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని బండి సంజయ్ అన్నారు.
Read also: Global Gender: లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. మహా జన సంపర్క్ అభియాన్లో భాగంగా ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్రంలో ప్రతిరోజూ 35 లక్షల కుటుంబాలను కలువనున్నారు బీజేపీ నేతలు. ఇవాళ పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరకు అందరూ ఈరోజు తమ నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా, ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రంలో కనీసం వంద కుటుంబాలను కలుస్తారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లోని ప్రజలను బండి సంజయ్ కలుస్తూ నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ.. కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
H-1B Visa: మోడీ పర్యటన వేళ.. భారతీయులకు అమెరికా గుడ్న్యూస్ చెప్పనుందా..?
తాజావార్తలు
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!