Bandi Sanjay: చివరి క్షణంలో రద్దైన అమిత్ షా టూర్.. కార్యకర్తలు నిరాశపడవద్దన్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: చివర క్షణంలో అమిత్ షా పర్యటన రద్దు అయ్యిందని, బీజేపీ కార్యకర్తలు నిరాశ చెందవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేకాకుండా.. ఖమ్మంలో బహిరంగ సభపై త్వరలో క్లిరిటీ ఇస్తామని తెలిపారు. ఇవాళ (గురువారం) ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బహిరంగ సభ వాయిదా పడింది. 24 గంటల పాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాల వల్ల బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపగా.. అన్ని రైళ్లను రద్దు చేశారు. ఆ ప్రాంతాల నుంచి దాదాపు 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశారు. ఈ క్లిష్ట సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సరికాదనే నిర్ణయానికి వచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే స్థిరపడ్డారు. భారీ జనసందోహం కోసం తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే అనివార్య కారణాల వల్ల సమావేశం రద్దయింది. త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయం. కార్యకర్తలు నిరాశ చెందవద్దని సూచించారు. ఇక 25న నాగర్ కర్నూల్ లో జరిగే నడ్డా సభ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. మోడీ పర్యటన తేదీపై క్లారిటీ లేదని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
Read also: Cm Kcr: నాగ్ పూర్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై బైపోర్ జాయ్ తుపాన్ ప్రభావం పడింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బిపార్జాయ్ తుఫాను ప్రధానంగా గుజరాత్పై ప్రభావం చూపుతుంది. దీంతో ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అమిత్ షా మరింత దృష్టి సారించాల్సి ఉంది. గుజరాత్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. బిపార్జోయ్ తుఫాను సన్నాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బిఫర్జాయ్ తుఫాను 150 కిలోమీటర్ల వేగంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గురువారం మొత్తం అమిత్ షా హైదరాబాద్ లోనే ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్ లో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉన్నందున పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!