Bandi Sanjay: అన్ని కొంటాన్న మొనగాడు కేంద్రానికి లేఖ ఎందుకు రాసిండో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో సీఎ కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పంటల సాగుకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు చేయకుండా రకరకాల హామీలు ఇస్తున్నారని ఆ తరువాత మర్చిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వరి.. వేస్తే రైతులకు ఉరి అంటాడు.. మరోసారి సన్న వడ్లు వేయాలే అంటాడు.. మరోసారి దొడ్డు వడ్లు వేయాలే అంటాడు. ఇంకోసారి యాసంగిలో వడ్లు కొనం అంటాడు.. ఇలా పరిపరి విధాలుగా ముఖ్యమంత్రి తలతిక్క మాటలు మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఆదరణ తగ్గుతుందని భయపడి వడ్ల కొనుగోలు డ్రామాలు మొదలుపెట్టి రైతులకు వరి కోత పెట్టాలని విమర్శించారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
2020-21వ సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి ఇవ్వవలసిన 9.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఇటీవలనే కేంద్రం వడ్లు కొనడం లేదు మేము కొంటామని ప్రగల్భాలు పలికాడు. మూడు రోజుల క్రితం ఈనెల 13న యాసంగిలో పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిండు అని మీడియాకు ఓ లేఖను చూపారు. అన్ని కొంటానన్న మొనగాడు ఇప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండో ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!