Bandi Sanjay Kumar: కేసీఆర్కు బీజేపీ ఫీవర్ పట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar Controversial Comments On CM KCR: గురువారం ప్రజాగోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు. ఆయనకు ఎలక్షన్ ఫీవర్ కాదు, బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం, ఇక ప్రజల్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ రుణమాఫీ చేయడం లేదని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసమే ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ అని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో.. ఈడీ విచారణపై కాంగ్రెస్ నేతలు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవమని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఆగస్ట్ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోన బీజేపీ, తాజాగా ఈ ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. దాదాపు పది రోజులపాటు కొనసాగనున్న ఈ ర్యాలీ సందర్భంగా.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్ని చుట్టేయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. ప్రజలు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాల్ని బీజేపీ ఎండగట్టనుంది. ఆ సమస్యల్ని తాము పరిష్కరిస్తామని భరోసానిస్తూ.. తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని గురువారం బండి సంజయ్ సిద్దిపేటలో ప్రారంభించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!