Bandi Sanjay: గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే.. కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay is angry with CM KCR: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు. ఆయన నిజాం అనుకుంటున్నాడు.. పక్క దేశాలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. అనేక మంది త్యాగాలతో సాధించుకున్న దేశానికి.. గొప్ప రాజ్యాంగాన్ని అందించారు అంబెడ్కర్ అన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం మనదన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించారు అంబెడ్కర్ అని బండి సంజయ్ కొనియాడారు. మోడీ ప్రధాని అవ్వడానికి కారణం రాజ్యాంగమే అన్నారు. దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడుతున్న వ్యక్తి మోడీ అని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Read also: Raghunandan Rao: ఖమ్మంలో బహిరంగ సభ పెడితే.. కరోనా పాండమిక్ ఉండదా?
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ముఖ్యమంత్రికి రాజ్యాంగం, కోర్ట్, మహిళలు అంటే గౌరవం లేదని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే కూడా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సాయుధ దళాల పరేడ్ లేకుండా చేసారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థనే గౌరవించడం లేదు.. మహిళా గవర్నర్ ని కూడా గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబెడ్కర్ ని అవమానిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఇదే గౌరవం ఇస్తావా.? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెట్టిన తరువాత కలిసిన అందరికి ఇదే చెప్పినవా.? వేడుకలు చెయ్యొద్దు అని.! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. కల్వకుంట రాజ్యాంగాన్ని అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని బండిసంజయ్ హెచ్చారించారు.
Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం
తాజావార్తలు
-
Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
-
Aprilia Tuono 457 Special Edition: ఏప్రిలియా Tuono 457 Special Edition విడుదల.. అదిరే ఫీచర్లు, ధర వివరాలు
-
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
-
Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
-
MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!