Bandi Sanjay: గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే.. కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay is angry with CM KCR: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు. ఆయన నిజాం అనుకుంటున్నాడు.. పక్క దేశాలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. అనేక మంది త్యాగాలతో సాధించుకున్న దేశానికి.. గొప్ప రాజ్యాంగాన్ని అందించారు అంబెడ్కర్ అన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం మనదన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించారు అంబెడ్కర్ అని బండి సంజయ్ కొనియాడారు. మోడీ ప్రధాని అవ్వడానికి కారణం రాజ్యాంగమే అన్నారు. దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడుతున్న వ్యక్తి మోడీ అని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Read also: Raghunandan Rao: ఖమ్మంలో బహిరంగ సభ పెడితే.. కరోనా పాండమిక్ ఉండదా?
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
ముఖ్యమంత్రికి రాజ్యాంగం, కోర్ట్, మహిళలు అంటే గౌరవం లేదని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే కూడా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సాయుధ దళాల పరేడ్ లేకుండా చేసారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థనే గౌరవించడం లేదు.. మహిళా గవర్నర్ ని కూడా గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబెడ్కర్ ని అవమానిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఇదే గౌరవం ఇస్తావా.? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెట్టిన తరువాత కలిసిన అందరికి ఇదే చెప్పినవా.? వేడుకలు చెయ్యొద్దు అని.! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. కల్వకుంట రాజ్యాంగాన్ని అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని బండిసంజయ్ హెచ్చారించారు.
Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం
తాజావార్తలు
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..