Bandi Sanjay: ప్రశ్నించే గొంతులను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశ్నించే వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ జిల్లా పెరమాండ్ల గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడాన్ని తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించాడన్ని వ్యతిరేఖిస్తే అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం అని.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీయడం..ఆ వీడియోను టీఆర్ఎస్ నేతలకు చూపిస్తూ రాక్షస పొందడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఐ ఫోన్ చేసి బాధితులను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం.. రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ సభ్యసమాజం తలొంచుకునేలా వ్యవహరించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ఈ ఘాతుకానికి పాల్పడ్డ సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని..పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ పుటేజీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన అమాయకులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్ట, న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే పార్టీ జిల్లా నాయకులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వాస్తవాలను సేకరిస్తోందని.. రేపు పార్టీ రాష్ట్ర శాఖ లీగల్ సెల్ టీం జిల్లాలో పర్యటించి వాస్తవాలను తెలుసుకుంటుందని.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతం ముక్త ఖంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ చేస్తున్న ఉద్యమంలో భాగం కావాలని బండి సంజయ్ కోరారు.
తాజావార్తలు
-
MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
-
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!