Bandi Sanjay: కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కోరాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి భవన్ లోనే ఉంటారని విమర్శలు గుప్పించారు.
డ్రగ్స్ కేసులో కూడా ఇంత వరకు పోలీసులు సాధించిందేం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార కేసులో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు…సీఎం చేతకాని తనం అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ క్రిమినల్స్ కు అడ్డాగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ప్రమేయం లేకపోతే సీఎం కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని అన్నారు.
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
క్రిమినల్స్ ను కఠినంగా శిక్షించాలి తప్పితే పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుపై కాలయాపన ఎందుకు చేశారని.. నిందితులను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. అమ్మాయి తనపై ఎవరు అత్యాచారం చేశారో చెప్పిందని.. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాన్ని ఒప్పించో, తప్పించో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమైన నాయకుల కుటుంబ సభ్యులను కేసు నుంచి తప్పించాలని.. వేరే పేర్లను పెట్టాలని సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ఇదే విధంగా అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!