B Vinod Kumar: ఆ బాధ్యత కేంద్ర హోంశాఖది.. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B Vinod Kumar Reacts On Central Orders Over Power Issue: విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలుంటే, కేంద్ర హోంశాఖ మాత్రమే చొరవ తీసుకొని, వాటి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. ఇప్పుడు విద్యుత్ బకాయిల విషయంలోనూ కేంద్ర హోంశాఖనే జోక్యం చేసుకోవాలే తప్ప.. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కాదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఏ మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు.
నిజానికి.. విద్యుత్ బకాయిల విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు వినాలని, ఆ తర్వాతే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని వినోద్ కుమార్ చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా కేవలం ఏపీ వాదనల్ని మాత్రమే సమర్థించి, నెలరోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేయడం సమర్థనీయం కాదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తప్పిదమే అవుతుందని ఫైరయ్యారు. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్రం హోం మంత్రిత్వ వాఖ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని.. కానీ ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో మౌనంగా ఉండటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య క్లెయిమ్స్ & కౌంటర్ క్లెయిమ్స్ పట్టించుకోక పోవడం చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టమవుతోందని ఆరోపణలు చేశారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ రూ. 12,940 కోట్లు బకాయి ఉందని చెప్తోన్నా.. వాటిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పట్టించుకోకుండా కేవలం ఏపీ వాదనల్ని మాత్రమే వినడం సరైన పద్ధతి కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ జెన్కో సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. దాన్ని నిరసిస్తూ.. తెలంగాణ జెన్కో & తెలంగాణ డిస్కం సంస్థలు రాష్ట్ర హై కోర్టులో రిట్ పిటిషన్లు వేశాయని కూడా వినోద్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!