Terror attack: హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror attack: హైదరాబాద్లో అరెస్టయిన రాడికల్ ఇస్లామిక్ (హెచ్యూటీ) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. భోపాల్ – హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏటీఎస్ పోలీస్ ల నిందితుల కస్టడీ లో కీలక విషయాలు వెల్లడించారు. జిమ్ ట్రైనర్ యసిర్ హైదరాబాద్- భోపాల్ యువకులకు ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్ యూ టీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు. హెచ్ యూ టీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని గుర్తించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తుంది.
భోపాల్ లోని.. భోజ్ పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్రకర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియో లు..కోడ్ భాషలో వున్న 50 కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోని శాంతి ద్వీపం పెల్చేయలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేసిన ATS అధికారులు. శాంతి ద్వీపం పేల్చడం అంటే బాంబు పేలుళ్ళు జరపడం అని గుర్తించారు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్టు ATS టీమ్ గుర్తించింది. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, త్వరలో ఇంకా నిందితుల వద్ద నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏటీఎస్ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డ్యామ్లు, స్టేడియాలను ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హైదరాబాద్లో ఉన్నప్పుడు అనంతగిరి కొండల్లో శిక్షణ పొందినట్టు ఏటీఎస్ గుర్తించింది. నిందితులు తమ ఉనికిని దాచుకునేందుకు డార్క్ వెబ్సైట్లను ఉపయోగించారు. ఈ నెల 9న హైదరాబాద్లో అరెస్టు చేసిన 16 మందిని ఏటీఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఆరుగురిని కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు పంపగా, మిగిలిన వారిని ఏటీఎస్ కస్టడీకి పంపింది. నిందితుడికి యాసిర్ నుంచి ఆదేశాలు అందినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. యాసిర్ కోసం ఏటీఎస్ అన్వేషణ ప్రారంభించింది. దాదాపు రెండేళ్లుగా హైదరాబాద్లో తలదాచుకున్న హెచ్యూటీ ఉగ్రవాదులపై ఏటీఎస్ నిఘా పెట్టింది. ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 9న అరెస్టయిన 16 మందిలో 11 మంది మధ్యప్రదేశ్కు చెందిన వారు. మిగిలిన ఐదుగురు హైదరాబాద్కు చెందిన వారు. ఈ నెల 10న హుద్రాబాద్లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ నెల 15న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్లో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
Centre vs AAP: ఆప్కు మద్దతుగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో సీఎం నితీష్ కుమార్..
తాజావార్తలు
-
Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!