Postal Vote: నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు.. వారికి మాత్రమే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ద్వారానే నిర్వహించనున్నారు. ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం తయారు చేసిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ పింక్ కలర్లో ఉంటాయి. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్లైన్లో పూర్తి చేయాలి మరియు దరఖాస్తును భౌతికంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
రాష్ట్రంలోనే తొలిసారిగా వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఇంటి వద్దకే ఓటు వేయాలనుకునే వారు ఈ నెల 7వ తేదీలోగా బూత్ లెవల్ అధికారి (బీఎల్వో)కి ’12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంది. వీరితో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న 13 శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో వారంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈసారి 13 లక్షల మందికి పైగా పోస్టల్ ఓటు హక్కును వినియోగించుకుని ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హులు.
Also Read
రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. జనరల్ ఇన్ స్పెక్టర్లు, పోలీస్ ఇన్ స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 60 మంది కాస్ట్ ఇన్ స్పెక్టర్లను నియమించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్లను సాధారణ పరిశీలకులుగా నియమించారు. శాంతి భద్రతల పరిశీలకులుగా 39 మంది ఐపీఎస్లను నియమించారు. ఈ నెల 10 నుంచి రాష్ట్రానికి వచ్చి తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పని చేయనున్నారు. వారి ఫోన్ నంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రెండు నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని పరిశీలకులుగా నియమించారు.
ఎన్నికల షెడ్యూల్
నవంబర్ 3 ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది
నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10
నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణ
పోలింగ్ తేదీ నవంబర్ 30
7 AM నుండి 5 AM వరకు
(13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే)
డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు
మొత్తం ఓటర్లు 3.17 కోట్లు
పురుషులు; 1.58 కోట్లు
స్త్రీలు; 1.58 కోట్లు
ట్రాన్స్ జెండర్స్; 2557
వికలాంగులు; 5.06 లక్షలు
80 ఏళ్లు పైబడిన వారు; 4.43 లక్షలు
100 ఏళ్లు పైబడిన వారు; 7,689
సేవా ఓటర్లు; 15,338
18, 19 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు; 8.11 లక్షలు
పోలింగ్ స్టేషన్లు; 35,356
అర్బన్ పోలింగ్ స్టేషన్లు; 14,458
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు; 20,898
ST రిజర్వుడ్; 12
SC రిజర్వ్వుడ్ 19
Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!