Posters : మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం..
- మావోయిస్టుల కు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం
- కన్నాయిగుడేం మండలం గుత్తికొయ గుడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా, ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు
- అడవిని వీడి ప్రజల్లోకి రండి ప్రజాస్వామ్య గొంతుక కండి అంటూ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posters : ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలుసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, వారికి మార్గదర్శనం చేసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్లలో మావోయిస్టు సిద్ధాంతాన్ని సూటిగా ప్రశ్నిస్తూ – “సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా… మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?” అని ప్రశ్నించారు. అంతేగాక, నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఆ ఉద్యమ మార్గం ప్రజల్లో ఆదరణ కోల్పోయి బీడుబూమిలా మారిపోయిందని వాఖ్యానించారు.
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
మావోయిస్టు అగ్రనాయకులకు ప్రత్యేకంగా సందేశం ఇచ్చిన పోస్టర్లలో.. “ఇకనైనా కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, మారిన కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో భాగస్వాములు కండి” అంటూ విజ్ఞప్తి చేశారు. ఆయుధాల మార్గాన్ని విసర్జించి ప్రజాస్వామ్య మార్గాన్ని అవలంబించాలన్న పిలుపు ఇందులో ప్రధానంగా ఉంది.
AP Government: ఆ అధికారులకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 10 నుంచి 14 శాతానికి పెంపు..!
“ఆయుధాలు మనకొద్దు.. ప్రజామోద మార్గమే ముద్దు” అంటూ స్పష్టమైన సందేశాన్ని ఈ పోస్టర్లు ఇచ్చాయి. మేధస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించుకోవాలని, గెరిళ్ల జీవితాన్ని వీడి మౌలిక సమాజంలో విలీనం కావాలని సూచించాయి.
ఈ పోస్టర్లు ఎవరివల్ల వెలిసాయి? నిజంగానే ‘ప్రజా ఫ్రంట్’ అనే వేదిక ఉందా? లేదా ఇది ప్రభుత్వ అనుబంధ సంస్థల కృషా ఫలితమా? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. అయితే ములుగు జిల్లాలో మావోయిస్టు గతి, గ్రామీణ ప్రజల ఆత్మస్థితి పట్ల కొనసాగుతున్న చర్చల మధ్య ఈ పోస్టర్లు కొత్త కోణాన్ని తెరపైకి తీసుకువచ్చాయి.
Bengaluru: ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..