Panjagutta Nisha Case: నిషా కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుట్రలో మరో ఇద్దరి హస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Big Twist In Panjagutta Nisha Case: హైదరాబాద్ పంజాగుట్ట నిషా కేసులో విస్తుగొలిపే ట్విస్టులు ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఆ మహిళ విజయసింహా అనే ఓ ఎమ్మెల్యే అనుచరుడు తనపై కత్తితో దాడి చేశాడని ‘మహానటి’ లెవెల్లో డ్రామాలు ఆడింది. పోలీసులు నిజమేననుకొని ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీరా చూస్తే.. ఆమె గొంతుపై ఎలాంటి గాయాలు లేవని తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. అప్పుడు అధికారులు తమదైన రీతిలో విచారిస్తే.. విజయసింహా ఈమధ్య తనని దూరం పెడుతున్నాడని, కలవడానికి రావడం లేదన్న అక్కసుతో ఈ కుట్రకు తెరతీసినట్టు నిషా పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
అయితే.. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కుట్రలో మరో ఇద్దరి హస్తం ఉన్నట్టు.. నిషా ఫోన్ని పరిశీలించాక పోలీసులకు తెలిసింది. అంతేకాదు.. గతంలోనూ నిషా ఇతర కేసుల్లో పోలీసులకు పట్టుబడినట్టు తేలింది. సంఘటన జరిగిన రోజు, అదే తనపై విజయసింహా దాడి చేశాడని నిషా డ్రామా ఆడిన రోజు.. తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు సూరజ్ కుమార్, నందకుమార్ అలియాస్ నందులతో నిషా దాదాపు 30 సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరిలో నందు అనే వ్యక్తి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ వద్ద పీఏగా పని చేస్తున్నాడు. సంఘటనకి ముందు ఆ ఇద్దరి వ్యక్తులు వాట్సాప్ కాల్స్లో చాలాసేపు మాట్లాడుకున్నారు. విజయసింహాను కేసులో ఇరికించేందుకు నెల రోజుల క్రితమే పక్కా స్కెచ్ వేసుకున్నారట! సూరజ్, నందుల మధ్య వందల ఫోన్ కాల్స్ నడిచినట్టు పోలీసుల విచారణలో తేలింది.
Also Read
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
మరో ట్విస్ట్ ఏమిటంటే.. నిషా ఆసుపత్రి బిల్లు చెల్లించిన అబ్రార్ అనే వ్యక్తి, దాడి జరిగినట్టు చెప్తున్న సమయంలో నిషాతోనే ఉన్నాడట! దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇది ఎంత పెద్ద కుట్రనో! చికిత్స అనంతరం గాయాలు లేవని తేలిన తర్వాత.. నిషాతో పాటు సూరజ్ అనే వ్యక్తి కూడా పరారయ్యాడు. తన అవసరానికి అనుగుణంగా నిషా బాడుగు, నిహారిక, కమల అంటూ నిషా తన పేర్లను మార్చుకుందని పోలీసులు గుర్తించారు. ఈ కుట్ర వెనుక ఎవరో పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో విచారణను కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..