Indira Canteen : అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు.. ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’గా
- అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ‘ఇందిరా క్యాంటీన్లు’గా కొత్త పేరు
- ఉదయం బ్రేక్ఫాస్ట్, శాశ్వత భవనాలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- ఇప్పటివరకు పేదలకు 10 కోట్ల భోజనాలు అందించిన క్యాంటీన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indira Canteen : హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి.
Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను విస్తరించినప్పటికీ, పేరును మాత్రం మార్పు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, ఈ కేంద్రాలకు ఇందిరా గాంధీ పేరిట ‘ఇందిరా క్యాంటీన్లు’గా పునర్నామకరణ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. త్వరలోనే ఉదయం బ్రేక్ఫాస్ట్ను కూడా రూ.5కే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూనూ తిరిగి డిజైన్ చేస్తున్నారు — ప్రతి ప్లేట్లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల ఊరగాయను సమతుల్యంగా చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇకపై ఈ కేంద్రాలను తాత్కాలిక షెడ్ల నుంచి శాశ్వత కట్టడాలుగా మార్చే పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలు తుప్పుపట్టిన షెడ్ల్లో, శిథిలావస్థలో ఉన్న గదుల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తీసుకుంది. అందులో పేర్కొన్న సూచనల ఆధారంగా పునః నిర్మాణ చర్యలు చేపట్టనున్నారు.
భవిష్యత్తులో కొత్త క్యాంటీన్లను కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్న GHMC, భోజనం తినేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉంది. ఇప్పటివరకు ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా దాదాపు 10 కోట్ల భోజనాలు పేదలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆకలితో ఉన్న ప్రజలకు ఈ క్యాంటీన్లు పెద్ద ఆశ్రయంగా నిలిచినట్లు గుర్తు చేశారు.
YS Jagan: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ
తాజావార్తలు
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!