Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.24వేల కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్టీవీలు, మొబైల్ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్ను తెలంగాణలో స్థాపించనుందని.. ఇందుకోసం రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ మేరకు అమెలెడ్ డిస్ప్లే యూనిట్ విషయాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్ తెలంగాణలో తయారవుతుందన్నారు. తెలంగాణకు ఈరోజు హిస్టారిక్ డే అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణకు వస్తున్న ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్లో 3వేల మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఛైర్మన్ రాజేష్ మేహత అన్నారు. దీంతో పాటు డిస్ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, ఈ రంగ అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలేస్ట్ కంపెనీ, ఆరో తరం అమోలెడ్ డిస్ప్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలేస్ట్ సీఈవో శ్యామ్ రఘుపతి పాల్గొన్నారు.
Historic day for Telangana😊
Rajesh Exports (Elest), a Fortune-500 company, to setup India's first Display FAB to manufacture the most advanced AMOLED displays, with an investment of ₹24,000 Cr, making it one of the largest investments in high-tech manufacturing sector in India pic.twitter.com/ygb9wK50j4
— KTR (@KTRBRS) June 12, 2022
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!