Amit Shah: ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటా.. కేసీఆర్ పాలనపై ధైర్యంగా కొట్లాడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Visits N Satyanarayana Home: మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని సాంబమూర్తి నగర్లో ఎన్. సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. ఒక చిన్న ఇంట్లో అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసి అమిత్ షా.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అమిత్ షాను చూసి ఉబ్బితబ్బిబ్బైన సత్యనారాయణ.. ‘‘సార్, 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా, మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అదృష్టం. నా జన్మధన్యమైంది. పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల నుంచి దళితుల్ని దారుణంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడికి సీఎం పదవి ఇస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ గాలికొదిలేశారని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ సైతం ఇంతవరకూ అమలు కాలేదని అన్నారు. దళిత బంధు పథకాన్ని సైతం పూర్తిగా నీరుగార్చారని, కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనను అంతమొందిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
సత్యనారాయణ చెప్పిందంతా సానుకూలంగా విన్న అమిత్ షా.. తాను ప్రతి కార్యకర్త ఇంట్లో ఉంటానని, మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి అంటూ భరోసా ఇచ్చారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉన్న అమిత్ షా.. ఆ తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్లతో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. కాగా.. మునుగోడులో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకే, ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ వ్యూహం రచించింది. ఇతర రాజకీయ పార్టీలు సైతం మునుగోడులో తమ సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!