Amit Shah: తెలంగాణ ప్రభుత్వాన్ని మారిస్తేనే.. సమస్యలు తీరుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Meeting With Farmers Associations Leaders In Begumpet: మునుగోడులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైతు సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన.. ఇక్కడి ప్రభుత్వాన్ని మారిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రుణ మాఫీ, ఫసల్ బీమా యోజనపై కూడా చర్చించారు. గో ఆధారిత సాగు చేయాలని సూచించిన ఆయన.. తన వద్ద కూడా 21 అవుతున్నాయని, వాటిలో 12 తరాల ఆవు ఒకటుందని అన్నారు. తానూ ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నానని, మొత్తం 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ చట్టం మార్చాలని రైతులు కోరారు. ఈ భేటీ అనంతరం అమిత్ షా మునుగోడుకు బయలుదేరారు.
అటు.. అమిత్ షాతో భేటీ అనంతరం బేగంపేట విమానాశ్రయంలో రైతు మాణిక్ రెడ్డి మాట్లాడారు. రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం వల్ల పంటలు మునిగిపోయాయని, ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని ఆయనకు వివరించామని, ఫసల్ బీమా అమలు చేయాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సఖ్యత లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటికి పరిష్కరించి తమకు ఫసల్ బీమా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజనలో భాగంగా 2 వేల నుంచి 5 వేలకు పెంచాలని తాము కోరామన్నారు. ఈ సందర్భంగా.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలని అమిత్ షా సూచించారన్నారు. తనకు 150 ఎకరాలున్నాయని, గోఆధారిత వ్యవసాయం చేస్తున్నట్లు అమిత్ షా చెప్పారని రైతు సంఘం నేతలు వివరించారు.
Also Read
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
ఇదే సమయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం దేశమంతా అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో అమలు చేయకపోవడంపై అభ్యుదయ రైతులు అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. ఎన్నో ప్రాంతాలకు చెందిన రైతులు ఈ భేటీలో పాల్గొన్నారని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపైనా అమిత్ షాకు రైతులు వివరించారన్నారు. భూసార పరీక్షలు చేయమని కేంద్రం నిధులిస్తే, అలాంటివేమీ చేపట్టడం లేదని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని మెరుగైన పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారన్నారు.
తాజావార్తలు
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!