Amit Shah : కేసీఆర్ తన పార్టీ సిద్దాంతము ఏంటో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీజేపీ మేధావులు, ప్రొఫెషనల్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలి తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు… యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేదన్నారు. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మోడీ పైన అవినీతి ఆరోపణలు లేవు.. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారు అయింది… పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసామని, విదేశాల్లో భారత్ గౌరవం పెరిగిందన్నారు అమిత్ షా.
అంతేకాకుండా.. ‘ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది… మన్మోహన్ సింగ్ చేసింది ఏమి లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచలేక పోయాడు.. కేసీఆర్ తన పార్టీ సిద్దాంతము ఏంటో చెప్పాలి. అయన లక్ష్యం కూతురు ను జైల్ కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం… బీజేపీ సిద్ధాంత పార్టీ. తెలంగాణ భవిష్యత్ ను ఎవరి చేతిలో పెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. కరోనా టైమ్ లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వాక్సిన్ ను మోడీ వాక్సిన్ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్ళు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సంపాదించుకున్నాడు. నీళ్ళు ఇవ్వలేదు…
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ లో మౌలిక వసతులు కల్పన కోసం లక్షల కోట్లు ఇచ్చారు.. ఏడున్నర లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశావో కెసిఆర్ చెప్పాలి. కేసీఆర్ నీకు ఇమ్మత్ ఉంటే నీ రెండు మేనిఫెస్టో లను చదువు. ఉద్యోగ నియామకాలు చేయలేదు.. కెసిఆర్ ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు కెసిఆర్ నీకు లేదు… దేశాన్ని మహోన్నత స్థానం కి తీసుకెళ్లే మోడీ తో తెలంగాణ ఉంటుందా… కొడుకు ను సీఎం చేయాలని అనుకుంటున్న కెసిఆర్ తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్తో ఎప్పుడు కలిసేది లేదు… కలిసి వెళ్ళేది లేదు… కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది… అభివృద్ది తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం…’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
- Tags
- Amit Shah
- big news
- bjp
- breaking news
- BRS
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!