Amit Shah : కేసీఆర్ తన పార్టీ సిద్దాంతము ఏంటో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీజేపీ మేధావులు, ప్రొఫెషనల్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలి తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు… యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేదన్నారు. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మోడీ పైన అవినీతి ఆరోపణలు లేవు.. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారు అయింది… పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసామని, విదేశాల్లో భారత్ గౌరవం పెరిగిందన్నారు అమిత్ షా.
అంతేకాకుండా.. ‘ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది… మన్మోహన్ సింగ్ చేసింది ఏమి లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచలేక పోయాడు.. కేసీఆర్ తన పార్టీ సిద్దాంతము ఏంటో చెప్పాలి. అయన లక్ష్యం కూతురు ను జైల్ కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం… బీజేపీ సిద్ధాంత పార్టీ. తెలంగాణ భవిష్యత్ ను ఎవరి చేతిలో పెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. కరోనా టైమ్ లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వాక్సిన్ ను మోడీ వాక్సిన్ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్ళు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సంపాదించుకున్నాడు. నీళ్ళు ఇవ్వలేదు…
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ లో మౌలిక వసతులు కల్పన కోసం లక్షల కోట్లు ఇచ్చారు.. ఏడున్నర లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశావో కెసిఆర్ చెప్పాలి. కేసీఆర్ నీకు ఇమ్మత్ ఉంటే నీ రెండు మేనిఫెస్టో లను చదువు. ఉద్యోగ నియామకాలు చేయలేదు.. కెసిఆర్ ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు కెసిఆర్ నీకు లేదు… దేశాన్ని మహోన్నత స్థానం కి తీసుకెళ్లే మోడీ తో తెలంగాణ ఉంటుందా… కొడుకు ను సీఎం చేయాలని అనుకుంటున్న కెసిఆర్ తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్తో ఎప్పుడు కలిసేది లేదు… కలిసి వెళ్ళేది లేదు… కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది… అభివృద్ది తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం…’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
- Tags
- Amit Shah
- big news
- bjp
- breaking news
- BRS
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?