Jana Reddy: ఏంజరిగిందో నాకు తెలియదు.. ఆయన్నే అడిగి తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Reddy: గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై టీపిసిసి అధ్యక్షులు పొన్నాల ఫైర్ అయన విషయం తెలిసిందే.. దీంతో.. పొన్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సముదాయించారు. అనంతరం ఓటు వినియోగించుకున్న జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. పొన్నాల వివాదం ఏంటి సార్ అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. వివాదం ఏంటిదో నాకు తెలియదు. నువ్వు తెలుసుకొని వచ్చి నాకు అడిగితే అప్పుడు చెబుతానంటూ సీరియస్ గా మాట్లాడారు జానారెడ్డి. మళ్లీ కూల్ గా దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంతర్వాత ఏఐసీసీకి డెమక్రటిక్ గా ఎన్నికలు జరగడం ఎలక్షన్స్ లో దేశంలోని కాంగ్రెస్ వర్గాలు మొత్తం పాల్గొనడం కాంగ్రెస్ పార్టీకి ఒక మలుపుకు సాంకేతం అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని కోరారు. వాదాలు, వివాదాల గురించి, ఇతర సమస్యల గురించి మాట్లాడటం తనకు సమంజసం కాదని తెలిపారు. పొన్నాల కోపడ్డారు ఏంటని మీడియా అడగ్గా ఏంజరిగిందో నాకు తెలియదు.. ఆయన్నే అడిగి తెలుసుకోండంటూ మాటమార్చారు జనారెడ్డి.
read also: AICC President Election: గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల ఫైర్..
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
గాంధీభవలో ఓటు వేయడానికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని ఎన్నికల సిబ్బంది నిరాకరించింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కొమ్మూరి ప్రతాప్ కు ఓటు ఇవ్వడంపై రగడ మొదలైంది. శ్రీనివాస్ రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరికి మాత్రమే ఓటింగ్ కు అవకాశం ముందని ఓటింగ్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. జనగామ నుంచి పొన్నాలతో పాటు శ్రీనివాసరెడ్డికి ఏఐసీసీ ఐడీకార్డు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వేళ గాందీభవన్ వద్ద పొన్నాల గరంగరం అయ్యారు. 45ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానమని పొన్నాల మండిపడ్డారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఎల్లుండి ఓట్లు లెక్కింపు జరగనుంది.
Special Story On Patanjali: పొరపాట్లను సరిచేసుకున్న పతంజలి.. పడి లేచిన కెరటమవుతుందా?
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!