TRS Delhi Tour : హస్తినకు పయనమైన మంత్రుల బృందం..
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Fired on Telangana BJP Chief Bandi Sanjay.
ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వడా అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలని, లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బండి సంజయ్కు ఏం సంబంధం అని ఆయన అన్నారు.
Also Read
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అంటే స్పష్టమైన హామీతో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా ? అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కొంటున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలన్నారు. ఈ వడ్లనే కొంటాం ఆ వడ్లనే కొంటాం అంటే ఎలా అని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఈయన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాడు, ఏం చేశాడో చెప్పాలన్నారు. ఇతని వలన రాష్ట్రానికి ఏం ఒరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
-
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
-
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!