TSPSC AEE Exam: నేడే ఏఈఈ రాతపరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య సూచనలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC AEE Exam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష OMR విధానంలో మాత్రమే నిర్వహించబడుతుంది. పేపర్-1 పరీక్ష 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read also: Nampally Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. గేట్లు మూసివేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశానికి అనుమతి లేదు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో.. పేపర్-2 ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
విధానం:
మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.
అభ్యర్థులకు సూచనలు..
* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పేపర్-1కి ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంటే అభ్యర్థులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు పరీక్ష హాలులో ఉంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు.
* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
* పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించరు. ఎవరైనా అభ్యర్థులు దీనిని తీసుకుంటే వారు డిబార్ చేయబడతారు.
* అభ్యర్థులు హాల్టికెట్లో ఇచ్చిన పరీక్ష నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. వాటిని అనుసరించాలి.
* చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం ఎక్కడుందో వెతకడం కంటే ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
* హాల్టికెట్పై ఫోటో స్పష్టంగా లేని, ఫోటో చిన్నదిగా ఉన్న, ఫోటో లేకుండా, సంతకం లేని అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నప్పుడు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్తోపాటు అండర్టేకింగ్ తీసుకోవాలి. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్కు సమర్పించాలి. లేకుంటే పరీక్షకు అనుమతించరు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!