Nampally Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం.. ఐదు కార్లు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గాంధీభవన్ సమీపంలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు నిమిషాల్లో వ్యాపించినట్లుగా సమాచారం. ఒక కారునుండి మరో అయిదు కార్లకు మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎక్జిబిషన్ లో వున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో.. అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీకెండ్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు.
Read also: Umesh Yadav: టీమిండియా క్రికెటర్కు షాక్.. రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు
2019లో నుమాయిష్లో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించిన విషయం తెలిసిందే. అయితే ఇవాలా ఎగ్జిబిషన్ పార్కింగ్ లో మంటల చలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సికింద్రాబాద్ ఘటన మరువక ముందే మళ్లీ నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Assembly Sessions: ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!