Nampally Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం.. ఐదు కార్లు దగ్ధం
Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గాంధీభవన్ సమీపంలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు నిమిషాల్లో వ్యాపించినట్లుగా సమాచారం. ఒక కారునుండి మరో అయిదు కార్లకు మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎక్జిబిషన్ లో వున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో.. అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీకెండ్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు.
Read also: Umesh Yadav: టీమిండియా క్రికెటర్కు షాక్.. రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు
2019లో నుమాయిష్లో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించిన విషయం తెలిసిందే. అయితే ఇవాలా ఎగ్జిబిషన్ పార్కింగ్ లో మంటల చలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సికింద్రాబాద్ ఘటన మరువక ముందే మళ్లీ నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Assembly Sessions: ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?