KA Paul: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి- కేఏ పాల్
- కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా- కేఏ పాల్
- నేను సీఎం అవుతాను.. నా సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో వందల మందిని బలి చేశారని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలు వేరే పార్టీ తరఫున పోటీ చేయకండి.. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకోండని సూచించారు.
Read Also: Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్తోజాయింట్ వెంచర్కు గుడ్ బై..
Also Read
చాలా మంది కులాన్ని వాడుకొని పార్టీలు లాభం పొందారు.. బీసీలను రెండు మూడు కులాల వారు అనగదొక్కారని కేఏ పాల్ తెలిపారు. రెడ్డిలు 12 మంది సీఎంలు అయ్యారని అన్నారు. కేసీఆర్ పేరు మీద లేదా పార్టీ మీద పోటీ చేద్దామనుకునే వారు వారికంటే దరిద్రులు ఇంకా ఎవరు లేరని చెప్పారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. పూలమ్మి.. పాలమ్మి అంత సంపాదించారా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. హైడ్రా పెద్ద డ్రామా అని ఆరోపించారు. రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు అని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం పెద్ద డ్రామానేనని కేఏ పాల్ అన్నారు.
Read Also: Kejriwal Vs LG: అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ
మరోవైపు.. అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదని.. ఆయన పేరు కూడా తెలియదన్నారు. చిరంజీవి, కృష్ణ తెలుసని చెప్పారు. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ను థియేటర్ లోపలికి ఎందుకు పంపారు.. ఆ హత్యలు మీకు భాగం లేదా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజాశాంతి కండువాలు కప్పుకోవాలి.. తన ఫోటో పెట్టుకుని తిరగండని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలవండని కేఏ పాల్ తెలిపారు. రూ. 10 పెట్టి ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోండని ప్రజలకు చెప్పారు.
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!