KA Paul: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి- కేఏ పాల్
- కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా- కేఏ పాల్
- నేను సీఎం అవుతాను.. నా సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో వందల మందిని బలి చేశారని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలు వేరే పార్టీ తరఫున పోటీ చేయకండి.. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకోండని సూచించారు.
Read Also: Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్తోజాయింట్ వెంచర్కు గుడ్ బై..
Also Read
చాలా మంది కులాన్ని వాడుకొని పార్టీలు లాభం పొందారు.. బీసీలను రెండు మూడు కులాల వారు అనగదొక్కారని కేఏ పాల్ తెలిపారు. రెడ్డిలు 12 మంది సీఎంలు అయ్యారని అన్నారు. కేసీఆర్ పేరు మీద లేదా పార్టీ మీద పోటీ చేద్దామనుకునే వారు వారికంటే దరిద్రులు ఇంకా ఎవరు లేరని చెప్పారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. పూలమ్మి.. పాలమ్మి అంత సంపాదించారా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. హైడ్రా పెద్ద డ్రామా అని ఆరోపించారు. రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు అని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం పెద్ద డ్రామానేనని కేఏ పాల్ అన్నారు.
Read Also: Kejriwal Vs LG: అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ
మరోవైపు.. అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదని.. ఆయన పేరు కూడా తెలియదన్నారు. చిరంజీవి, కృష్ణ తెలుసని చెప్పారు. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ను థియేటర్ లోపలికి ఎందుకు పంపారు.. ఆ హత్యలు మీకు భాగం లేదా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజాశాంతి కండువాలు కప్పుకోవాలి.. తన ఫోటో పెట్టుకుని తిరగండని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలవండని కేఏ పాల్ తెలిపారు. రూ. 10 పెట్టి ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోండని ప్రజలకు చెప్పారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో