ఆదిలాబాద్ రిమ్స్ లో కాలం చెల్లిన ఇంజెక్షన్ ల పై విచారణ కొనసాగుతుంది. వాటిని మూడవ అంతస్తులోని పురుషుల వార్డులో కొంతమంది రోగులకు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రోగి బందువు గుర్తిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అంతవరకు రిమ్స్ వైద్యసిబ్బంది వాటిని గుర్తించలేదు. అయితే దీని పై విచారణ చేపట్టిన రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్… తప్పు జరిగింది. అదెలా జరిగిందో అరా తీస్తున్నా అని ఎన్టీవీతో తెలిపారు. సెఫ్ట్రియోక్సన్ అనే కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఎలా వచ్చాయో తెలుసుకుంటున్నా. పూర్తి విచారణ చేపట్టి బాద్యులపై చర్యలు తీసుకుంటాం అన్నారు. అయితే సెఫ్ట్రియాక్స్ న్ అనే ఇంజెక్షన్ గడువు దాటింది ఇచ్చారు అని బాధితులు తెలిపారు. కానీ ఈడ్రగ్ స్టోర్ లో లేదు.. మరి ఇక్కడికి ఎలా వచ్చిందోఆరాతీస్తున్నాం అని డైరెక్టర్ పేర్కొన్నారు.