Adilabad Airport: ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. కీలక ముందడుగు
- ఆదిలాబాద్ విమానాశ్రయానికి 700 ఎకరాల భూసేకరణకు అనుమతి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి నూతన ఊపిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ (Joint User Airfield) ఏర్పాటుకు సంబంధించి మొత్తం 700 ఎకరాల భూసేకరణకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు దారితీయనుంది.
విమానాశ్రయ అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన నివేదిక సానుకూలంగా రావడంతో, ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఉత్తర తెలంగాణకు ఆర్థికంగా కొత్త ఊపిరి పోసే ప్రాజెక్ట్ అని అన్నారు. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు.. ప్రతి రంగానికీ ఇది లాభదాయకం అవుతుంది అని పేర్కొన్నారు.
Also Read
ప్రాంతీయ సమతుల్యాభివృద్ధి కోసం సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగుతోందని అన్నారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో దేశ విమానయాన పటంలో ఒక కీలక స్థానాన్ని సంపాదించబోతోందన్నారు.
ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ ఆర్థిక వృద్ధికి నూతన ద్వారం అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
YS Jagan: రేపు మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాలకు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?