YS Jagan: రేపు మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాలకు వైఎస్ జగన్..
- మొంథా తుఫాన్తో ఏపీలో భారీ నష్టం..
- తుఫాన్ బాధిత ప్రాంతాల్లో రేపు వైఎస్ జగన్ పర్యటన..
- పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజక వర్గాల్లో..
- దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించనున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మొంథా తుపాను కృష్ణా జిల్లా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.. వరి సాగు చేస్తున్న రైతులపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. వరి సాగుకు రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో కొన్ని.. కంకులు గట్టి పడే దశలో మరికొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశకు కూడా చేరాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చి పడిన మొంథా తుఫాన్ రైతులను తీవ్రంగా నష్టపరిచింది. వరుసగా మూడు రోజులు పాటు కురిసిన వర్షాలతో రైతులు కుదేలయ్యారు.. చేతికందే తరుణంలో ఉన్న వరిపైర్లు నేల వాలాయి. పైరుపై వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో కంకులు దెబ్బతిని తాలు వస్తుందని.. తెగుళ్లు విజృంబించి దిగుబడులు గణనీయంగా పడిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
ఒక్క కృష్ణా జిల్లాలోనే 421 గ్రామాల పరిధిలో 56,040 మంది రైతులు నష్టాన్ని చవిచూశారు. 48,357 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 54,180 మంది రైతులకు చెందిన 45,040 హెక్టార్ల వరిపంట నేలవాలింది. 288 హెక్టార్లలో వేరుశనగ, 985 హెక్టార్లలో మినుము దెబ్బతిన్నాయి. ఇంకా ఉద్యానశాఖకు సంబంధించి 1,418.22 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.. అయితే ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తగుచర్యలు చేపట్టడం లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చినట్లుగా పంట భీమాలు లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ తుపాను సమయంలోనే గ్రామాల్లో సందర్శించి, బాధితులకు అండగా నిలవాలని తన పార్టీ నేతలకు ఆదేశించారు. దీంతో పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ తమ స్థాయిలో బాధితులకు అండగా నిలిచారు. తాజాగా వైఎస్ జగన్ కూడా కృష్ణా జిల్లాలో రేపు పర్యటించనున్నారు..
Read Also: Pakistan: పాకిస్తాన్లో ‘‘జై శ్రీ రామ్’’ నినాదాలు చేసిన రష్యా వ్యక్తి.. రియాక్షన్ వీడియో వైరల్..
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు. మధ్యలో తుపాను వలన నష్టపోయిన పంటలను సందర్శిస్తారు. అక్కడే బాధిత రైతులను పరామర్శిస్తారు.. పంట నష్టం అంచనాలు తదితర అంశాల గురించి కూడా అక్కడే రైతులను అడిగి తెలుసుకుంటారు. పెడన నియోజకవర్గంలోని గూడురు మీదుగా అవనిగడ్డ మార్గంలోకి వెళ్లి పలు ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తారు. అక్కడక్కడా నేలకొరిగిన పైర్లను కూడా జగన్ స్వయంగా సందర్శించనున్నారు.. పర్యటన అనంతరం ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురానున్నారు జగన్.. ఇక, జగన్ పర్యటన నేపధ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాంల నేతృత్వంలో పార్టీశ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్ గత పర్యటన లాగానే భారీగా తరలివచ్చే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!