Vikarabad Post Office: వికారాబాద్ లో పోస్ట్ మాన్ నిర్వాకం.. చెత్తకుప్పలో ఆధార్, పాన్, ఏటీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Post Office: అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో ఎక్కడికి వెళ్లినా జేబులో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మీరు మీ చిరునామాను మార్చాలనుకుంటే, మీ ఇంటి పేరును మార్చాలనుకుంటే లేదా మీ ఫోన్ నంబర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్, అంతేకాదు బ్యాంక్ నుంచి ఏటీఎంలు ఇలా ఏది మార్చుకున్నా నేరుగా మన చేతికి ఇవ్వరు. అవి పోస్ట్ ద్వారా రావాల్సిందే.. అది అందరికి తెలిసిన విషయమే.. ఇది ఎప్పటి నుంచో వస్తున్న రూల్.. కానీ దాన్ని ఓ పోస్ట్ మ్యాన్ చెత్తలో పడేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్త కుప్పలో వేల సంఖ్యలో ఆధార్, పాన్, లెటర్లు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో చోటుచేసుకుంది.
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో నరసింహులు అనే వ్యక్తి పోస్ట్ మాన్ పనిచేస్తున్నాడు. పోస్టాఫీసులకు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వచ్చినవాటన్నింటిని కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు 2011 నుంచి లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను చెత్త కుప్పలో పడేసాడు. దాదాపు 14 సంవత్సారాల ఆదార్, పాన్, ఏటీఎంలు, లెటర్లు అన్నీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయడంతో గ్రామప్రజలు షాక్ తిన్నారు. పోస్ట్ మాన్ గా ఇన్ని రోజులు నెలకు జీతం తీసుకుని చేతులు దులుపుకున్నాడు. అయితే.. వచ్చినవన్నీ పోస్టాఫీసులో చెత్తలా పేరుకుపోతుండటంతో ఎలాగైనా చెత్తకుప్పలో పడివేయడం మంచిదని భావించాడు. గ్రామపంచాయతీకి కాల్ చేశాడు.
దీంతో గ్రామ పంచాయితీ ట్రాక్టర్ అక్కడకు రావడంతో అధార్, పాన్, లెటర్లు, ఏటీఎంలు అన్నీ మూటలో తీసుకుని వచ్చి చెత్తకుప్పలో పారివేయడంతో పోస్ట్ మాన్ భాగోతం వెలుగుచూసింది. కార్యాలయానికి వచ్చినవన్నీ అలాగే పడివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు, గంటల తరబడి ఆధార్ సెంటర్లలో నిలుచుని ఆధార్ తీయించుకుంటే.. వాటిని ఇవ్వకుండా చెత్తకుప్పలో పడవేయడమేంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు అడిగినా రాలేదంటూ మాట దాటేస్తు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండి వచ్చిన జీతంతో జల్సా చేసుకున్నాడు కానీ.. ప్రజలగురించి ఆలోచించలేకపోయాడని మండిపడ్డారు.
GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే.. ఇప్పటికైనా మేల్కోవాలి..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!