Vikarabad Post Office: వికారాబాద్ లో పోస్ట్ మాన్ నిర్వాకం.. చెత్తకుప్పలో ఆధార్, పాన్, ఏటీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Post Office: అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో ఎక్కడికి వెళ్లినా జేబులో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మీరు మీ చిరునామాను మార్చాలనుకుంటే, మీ ఇంటి పేరును మార్చాలనుకుంటే లేదా మీ ఫోన్ నంబర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్, అంతేకాదు బ్యాంక్ నుంచి ఏటీఎంలు ఇలా ఏది మార్చుకున్నా నేరుగా మన చేతికి ఇవ్వరు. అవి పోస్ట్ ద్వారా రావాల్సిందే.. అది అందరికి తెలిసిన విషయమే.. ఇది ఎప్పటి నుంచో వస్తున్న రూల్.. కానీ దాన్ని ఓ పోస్ట్ మ్యాన్ చెత్తలో పడేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్త కుప్పలో వేల సంఖ్యలో ఆధార్, పాన్, లెటర్లు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో చోటుచేసుకుంది.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో నరసింహులు అనే వ్యక్తి పోస్ట్ మాన్ పనిచేస్తున్నాడు. పోస్టాఫీసులకు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వచ్చినవాటన్నింటిని కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు 2011 నుంచి లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను చెత్త కుప్పలో పడేసాడు. దాదాపు 14 సంవత్సారాల ఆదార్, పాన్, ఏటీఎంలు, లెటర్లు అన్నీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయడంతో గ్రామప్రజలు షాక్ తిన్నారు. పోస్ట్ మాన్ గా ఇన్ని రోజులు నెలకు జీతం తీసుకుని చేతులు దులుపుకున్నాడు. అయితే.. వచ్చినవన్నీ పోస్టాఫీసులో చెత్తలా పేరుకుపోతుండటంతో ఎలాగైనా చెత్తకుప్పలో పడివేయడం మంచిదని భావించాడు. గ్రామపంచాయతీకి కాల్ చేశాడు.
దీంతో గ్రామ పంచాయితీ ట్రాక్టర్ అక్కడకు రావడంతో అధార్, పాన్, లెటర్లు, ఏటీఎంలు అన్నీ మూటలో తీసుకుని వచ్చి చెత్తకుప్పలో పారివేయడంతో పోస్ట్ మాన్ భాగోతం వెలుగుచూసింది. కార్యాలయానికి వచ్చినవన్నీ అలాగే పడివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు, గంటల తరబడి ఆధార్ సెంటర్లలో నిలుచుని ఆధార్ తీయించుకుంటే.. వాటిని ఇవ్వకుండా చెత్తకుప్పలో పడవేయడమేంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు అడిగినా రాలేదంటూ మాట దాటేస్తు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండి వచ్చిన జీతంతో జల్సా చేసుకున్నాడు కానీ.. ప్రజలగురించి ఆలోచించలేకపోయాడని మండిపడ్డారు.
GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే.. ఇప్పటికైనా మేల్కోవాలి..
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!