Sangareddy Crime: దారుణం.. మహిళకు కల్లుతో మత్తు మందు ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Woman Robbed By A Couple In Sangareddy: సంగారెడ్డిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా దారిలో వెళ్తుండగా.. ఒక జంట ఆమెను ఆపి, కల్లులో మత్తు మందు కలిపి, నిలువునా దేచేసుకున్నారు. మత్తు దిగిన తర్వాత విషయం గ్రహించి.. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరు మండలంలో రామేశ్వరం బండకు ఒక మహిళ ఒంటరిగా వెళ్తోంది. అక్కడే ఉన్న ఒక జంట ఆమెని ఆపి.. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడిగారు. ఆ తర్వాత ఆ మహిళతో మాట మాట కలిపారు.
Social Look: పొట్టి నిక్కర్ లో రష్మిక.. అలా వెనక్కి తిరిగి చూసిన వరుణ్ తేజ్
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
అనంతరం తమ స్కూటీపై రామేశ్వరం బండ వద్ద డ్రాప్ చేస్తామని చెప్పి ఆ మహిళను ఎక్కించుకున్నారు. తనకూ కాస్త నడిచే భారం తగ్గుతుంది కదా.. ఆమె స్కూటీపై ఎక్కింది . రామేశ్వరం బండ వద్ద దిగాక.. ఆ జంట కల్లు ఆఫర్ చేశారు. ఉచితంగా వస్తోంది కదా అని, ఆ మహిళ సరేనంది. ఇదే అవకాశమని భావించి.. ఆ జంట కల్లులో మత్తుపదార్థం కలిపి, ఆ మహిళకు ఇచ్చారు. అది తాగాక ఆ మహిళ మత్తులోకి జారుకుంది. ప్లాన్ సక్సెస్ కావడంతో.. ఆ జంట ఆమెపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 25 వేలు తీసుకుని పరారయ్యారు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
Vijay Antony: బ్రేకింగ్.. విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమం..?
మత్తు దిగిన తర్వాత ఆ మహిళ విషయం గ్రహించింది. ఆ జంట తనని మోసం చేసి, నిండా దోచేసిందని అర్థం చేసుకుంది. విషయం కుటుంబసభ్యులకు తెలియజేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గ్రామంలో సీసీటీవీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించగా.. అందులో మొత్తం తతంగం రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా పోలీసులు ఆ జంటని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!