Sangareddy Crime: దారుణం.. మహిళకు కల్లుతో మత్తు మందు ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Woman Robbed By A Couple In Sangareddy: సంగారెడ్డిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా దారిలో వెళ్తుండగా.. ఒక జంట ఆమెను ఆపి, కల్లులో మత్తు మందు కలిపి, నిలువునా దేచేసుకున్నారు. మత్తు దిగిన తర్వాత విషయం గ్రహించి.. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరు మండలంలో రామేశ్వరం బండకు ఒక మహిళ ఒంటరిగా వెళ్తోంది. అక్కడే ఉన్న ఒక జంట ఆమెని ఆపి.. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడిగారు. ఆ తర్వాత ఆ మహిళతో మాట మాట కలిపారు.
Social Look: పొట్టి నిక్కర్ లో రష్మిక.. అలా వెనక్కి తిరిగి చూసిన వరుణ్ తేజ్
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
అనంతరం తమ స్కూటీపై రామేశ్వరం బండ వద్ద డ్రాప్ చేస్తామని చెప్పి ఆ మహిళను ఎక్కించుకున్నారు. తనకూ కాస్త నడిచే భారం తగ్గుతుంది కదా.. ఆమె స్కూటీపై ఎక్కింది . రామేశ్వరం బండ వద్ద దిగాక.. ఆ జంట కల్లు ఆఫర్ చేశారు. ఉచితంగా వస్తోంది కదా అని, ఆ మహిళ సరేనంది. ఇదే అవకాశమని భావించి.. ఆ జంట కల్లులో మత్తుపదార్థం కలిపి, ఆ మహిళకు ఇచ్చారు. అది తాగాక ఆ మహిళ మత్తులోకి జారుకుంది. ప్లాన్ సక్సెస్ కావడంతో.. ఆ జంట ఆమెపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 25 వేలు తీసుకుని పరారయ్యారు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
Vijay Antony: బ్రేకింగ్.. విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమం..?
మత్తు దిగిన తర్వాత ఆ మహిళ విషయం గ్రహించింది. ఆ జంట తనని మోసం చేసి, నిండా దోచేసిందని అర్థం చేసుకుంది. విషయం కుటుంబసభ్యులకు తెలియజేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గ్రామంలో సీసీటీవీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించగా.. అందులో మొత్తం తతంగం రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా పోలీసులు ఆ జంటని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
Kishan Reddy: బీఆర్ఎస్ కలల పార్టీ.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
తాజావార్తలు
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..