Vande Bharat Train: వందే భారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Train: వందే భారత్ రైలు ప్రమాదం తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలోని రైలు పట్టాల వద్ద చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు అదే వేగంతో నడుస్తోంది. మిర్యాలగూడ మండలం తీక్యాతండా సమీపంలో ఉదయం 9 గంటల సమయంలో రైలు పట్టాలపై గేదె వచ్చింది. అయితే వేగంగా వచ్చిన వందేభారత్ రైలు ఢీకొనడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన డ్రైవర్ వెంటనే రైలును ఆపి తనిఖీ చేశారు. ఈ ఘటనలో రైలు డ్యామేజ్ కాలేదని తెలుసుకున్న తర్వాత తిరిగి బయలుదేరింది. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్ఐ పవన్కుమార్రెడ్డి, ఏఎస్ఐ ప్రసాద్ పరిశీలించారు. గేదె యజమాని కోసం వెతుకుతున్నారు.
Read also: Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క
Also Read
రాజస్థాన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది. వందే భారత్ రైలు వేగంగా వెళ్తూ పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివదయాల్ గా గుర్తించి అతడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!