Justice : పార్కింగ్ కోసం 17 ఏళ్లు… చివరికి న్యాయం ఇలా..!
- 37 ఏళ్ల వయసులో మొదలైన న్యాయ పోరాటం
- వినియోగదారుల కమిషన్ నుంచి జాతీయ స్థాయికి
- తీర్పు అమలు వాయిదా పడిన కారణం
- ప్రత్యామ్నాయంగా రూ.10 లక్షల పరిహారం చెల్లింపు
Justice : 2008లో 37 ఏళ్ల వయసులో సేవా లోపంపై న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించిన ఒక ప్రైవేటు ఉద్యోగి, 17 ఏళ్ల దీర్ఘ న్యాయపోరాటం తర్వాత 54 ఏళ్ల వయసులో విజయం సాధించారు. చివరకు రూ.10 లక్షల పరిహారం అందుకున్నారు. 2006లో మలేసియా టౌన్షిప్లోని రెయిన్ ట్రీ పార్క్ ఎ-బ్లాక్లో శివ కె.రావు ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి, కారు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించారు. అయితే, ఆయనకు పైపులు లీకయ్యే, ఇరుకైన అసౌకర్యంగా ఉన్న పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. దీన్ని మార్చాలని కోరినా అధికారులు స్పందించలేదు.
Broccoli: బ్రోకలి శాండ్విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
దీంతో, 2008లో ఆయన ఏపీహెచ్బీ (ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు) , ఐజేయం జాయింట్ వెంచర్ సిట్కో ప్రైవేట్ లిమిటెడ్పై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 2011లో జిల్లా కమిషన్ ఆయన వాదనలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత సిట్కో రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో అప్పీల్ వేసినా, 2013లో రూ.10 వేల కేసు ఖర్చులతో అది కొట్టివేయబడింది.
సిట్కో తరువాత జాతీయ వినియోగదారుల కమిషన్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. 2020 అక్టోబర్ 27న అక్కడ కూడా శివ కె.రావు స్వయంగా వాదించి విజయం సాధించారు. స్టేట్ కమిషన్ తీర్పు తర్వాత 2014లో అమలు పిటిషన్ వేసినా, రివిజన్ పిటిషన్ కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి, సోమవారం ఈ వివాదానికి ముగింపు లభించింది. కారు పార్కింగ్ కేటాయించడం సాధ్యం కాదని ప్రతివాది సంస్థ అంగీకరించి, ప్రత్యామ్నాయంగా రూ.10 లక్షలు చెల్లించింది. ఫిర్యాదుదారు ఖాతాలో డబ్బు జమ కావడంతో, రంగారెడ్డి జిల్లా కమిషన్ అధ్యక్షురాలు లతాకుమారి, సభ్యుడు జవహర్బాబు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ను ముగించారు.
War 2: జూనియర్ ఫాన్స్, ఎటాక్.. వార్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్!
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!