Broccoli: బ్రోకలి శాండ్విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dies After Eating Broccoli Sandwich: కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రకోలీ క్యాబేజీ కుటుంబానికి చెందినవి. ఇవి మార్కెట్లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్లా తీసుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
READ MORE: SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
దక్షిణ ఇటలీలో బొటులిజం అనే ప్రాణాంతక వ్యాధి బయటపడింది. తాజాగా 52 ఏళ్ల కళాకారుడు, మ్యూజీషియన్ లుయిగి డి సర్నో కోసెంజాలోని డయామంటేలో ఒక ఫుడ్ ట్రక్ నుంచి బ్రోకలీ, సాసేజ్ శాండ్విచ్ తిని మరణించారు. ఇద్దరు యువకులు సహా మరో తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శాండ్విచ్లలో ఉపయోగించే నూనెలో నిల్వ చేసిన బ్రోకలీ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. ఈ జాడీలను ఇప్పుడు దేశవ్యాప్తంగా రీకాల్ చేశారు.
READ MORE: PM Modi Resignation: ప్రధాని మోడీ రాజీనామా, ఆ తర్వాతే లోక్సభ రద్దు.. టీఎంసీ నేత వ్యాఖ్యలు వైరల్!
లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నేపుల్స్ ప్రావిన్స్లోని సెర్కోలాకు చెందిన లుయిగి డి సర్నో (52) ఒక కళాకారుడు. సెలవుల కారణంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చారు. డి సర్నో తన కుటుంబంతో కలిసి కోసెంజా ప్రావిన్స్ డయామంటేలోని సముద్ర తీరంలో ఒక ఫుడ్ ట్రక్ వద్ద ఆగారు. అక్కడ వారు బ్రోకలీ, సాసేజ్ శాండ్విచ్లను ఆర్డర్ చేశారు. వారి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన కొద్దిసేపటికే.. పోటెంజాలోని లాగోనెగ్రో సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. బాసిలికాటా పట్టణంలో ఆగి ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు.
ఈ శాండ్విచ్లో ప్రాణాంతకమైన టాక్సిన్(విషం) ఫామ్ అయ్యిందని అనుమానిస్తున్నారు. అదే ఆహారాన్ని తిన్న మరో తొమ్మిది మంది బోటులిజం అనే ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో ఇటలీలో బ్రోకలీని భారీగా వెనక్కి తీసుకురావడానికి దారితీసింది. బొటులిజం అనేది క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల వస్తుంది. ఇది సరిగ్గా ప్రాసెస్ చేయని ఆహారాలలో అభివృద్ధి చెందుతుంది. ఇది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల పక్షవాతం కలిగిస్తుంది. దాదాపు 10 శాతం కేసులలో ప్రాణాంతకం కావచ్చు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!