Broccoli: బ్రోకలి శాండ్విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Dies After Eating Broccoli Sandwich: కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రకోలీ క్యాబేజీ కుటుంబానికి చెందినవి. ఇవి మార్కెట్లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్లా తీసుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
READ MORE: SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
Also Read
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
- Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
- Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ గ్లింప్స్!
దక్షిణ ఇటలీలో బొటులిజం అనే ప్రాణాంతక వ్యాధి బయటపడింది. తాజాగా 52 ఏళ్ల కళాకారుడు, మ్యూజీషియన్ లుయిగి డి సర్నో కోసెంజాలోని డయామంటేలో ఒక ఫుడ్ ట్రక్ నుంచి బ్రోకలీ, సాసేజ్ శాండ్విచ్ తిని మరణించారు. ఇద్దరు యువకులు సహా మరో తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శాండ్విచ్లలో ఉపయోగించే నూనెలో నిల్వ చేసిన బ్రోకలీ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. ఈ జాడీలను ఇప్పుడు దేశవ్యాప్తంగా రీకాల్ చేశారు.
READ MORE: PM Modi Resignation: ప్రధాని మోడీ రాజీనామా, ఆ తర్వాతే లోక్సభ రద్దు.. టీఎంసీ నేత వ్యాఖ్యలు వైరల్!
లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నేపుల్స్ ప్రావిన్స్లోని సెర్కోలాకు చెందిన లుయిగి డి సర్నో (52) ఒక కళాకారుడు. సెలవుల కారణంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చారు. డి సర్నో తన కుటుంబంతో కలిసి కోసెంజా ప్రావిన్స్ డయామంటేలోని సముద్ర తీరంలో ఒక ఫుడ్ ట్రక్ వద్ద ఆగారు. అక్కడ వారు బ్రోకలీ, సాసేజ్ శాండ్విచ్లను ఆర్డర్ చేశారు. వారి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన కొద్దిసేపటికే.. పోటెంజాలోని లాగోనెగ్రో సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. బాసిలికాటా పట్టణంలో ఆగి ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు.
ఈ శాండ్విచ్లో ప్రాణాంతకమైన టాక్సిన్(విషం) ఫామ్ అయ్యిందని అనుమానిస్తున్నారు. అదే ఆహారాన్ని తిన్న మరో తొమ్మిది మంది బోటులిజం అనే ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో ఇటలీలో బ్రోకలీని భారీగా వెనక్కి తీసుకురావడానికి దారితీసింది. బొటులిజం అనేది క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల వస్తుంది. ఇది సరిగ్గా ప్రాసెస్ చేయని ఆహారాలలో అభివృద్ధి చెందుతుంది. ఇది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల పక్షవాతం కలిగిస్తుంది. దాదాపు 10 శాతం కేసులలో ప్రాణాంతకం కావచ్చు.
తాజావార్తలు
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
-
Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ గ్లింప్స్!
-
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?