Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరాం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ప్రమాద బీమా కోసం యూబీఐతో గురువారం కీలక ఒప్పందం చేసుకోనున్నట్లు సీఎండీ వెల్లడించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న (బుధవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సింగరేణిలో ఈ ఏడాది రూ.1000 హెరిటేజ్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలి. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్లో సింగరేణి అతిథి గృహ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Read also: Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
Also Read
నిరుద్యోగ యువతకు నల్గొండ కలెక్టర్ శుభవార్త అందించారు. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు 100కు పైగా కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 26న నల్గొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్ను నల్గొండ కలెక్టర్ హరిచందన Xలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటించారు.మరో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.
Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!