Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరాం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ప్రమాద బీమా కోసం యూబీఐతో గురువారం కీలక ఒప్పందం చేసుకోనున్నట్లు సీఎండీ వెల్లడించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న (బుధవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సింగరేణిలో ఈ ఏడాది రూ.1000 హెరిటేజ్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలి. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్లో సింగరేణి అతిథి గృహ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Read also: Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
Also Read
నిరుద్యోగ యువతకు నల్గొండ కలెక్టర్ శుభవార్త అందించారు. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు 100కు పైగా కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 26న నల్గొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్ను నల్గొండ కలెక్టర్ హరిచందన Xలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటించారు.మరో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.
Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!