Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరాం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ప్రమాద బీమా కోసం యూబీఐతో గురువారం కీలక ఒప్పందం చేసుకోనున్నట్లు సీఎండీ వెల్లడించారు. సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న (బుధవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సింగరేణిలో ఈ ఏడాది రూ.1000 హెరిటేజ్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలి. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్లో సింగరేణి అతిథి గృహ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Read also: Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
Also Read
నిరుద్యోగ యువతకు నల్గొండ కలెక్టర్ శుభవార్త అందించారు. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు 100కు పైగా కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 26న నల్గొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్ను నల్గొండ కలెక్టర్ హరిచందన Xలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటించారు.మరో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.
Philippines : ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
తాజావార్తలు
-
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
-
Lectrix NDuro: 120KM రేంజ్తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!