Asifabad: గేదెను కరిచిన కుక్క.. ఆసుపత్రి పాలైన 302 మంది
Asifabad: కుక్క కరిచిన గేదె పాలు తాగిన గ్రామస్తులు భయంతో ఆస్పత్రి వద్దకు పరుగులు పెట్టారు. పాలు తాగిన 302 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను వేయించుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Read also: Terror attack: హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ
Also Read
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన పాడి రైతు కాసబోయిన నానయ్యకు 16 గేదెలు ఉన్నాయి. పాడి గేదెల పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం ఓ గేదెను పిచ్చి కుక్క కరిచింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రామంలోని వందలాది మందికి గేదె పాలు, పెరుగు విక్రయించాడు. అయితే రెండు రోజుల క్రితం కుక్క కరిచిన గేదె దూడ చనిపోయింది. ఈ విషయం కాస్త ఆనోట ఈనోట వెళ్ళి నానయ్య దగ్గర పాలు, పెరుగు కొనేవాళ్లకి తెలియడంతో షాక్ తిన్నారు, భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించి పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నానయ్య నుంచి పాలు, పెరుగు కొనుగోలు చేసి వినియోగించిన 302 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. బాధితుల్లో మండల అధికారులు కూడా ఉండడం గమనార్హం. కానీ పాలను వేడి చేసిన తర్వాత తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. అయితే దూడ పొదుగు వద్ద కొరికితే పాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ముందస్తుగా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. గేదె పాలు తాగిన దూడ అయితే చనిపోయింది. కుక్క కరిచిన గేదెకు మాత్రం ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే దూడకు ఏమైనా అనారోగ్యం కారణంగానే చనిపోయి ఉంటుందని ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.
ఆ విషయంలో.. ఎక్కువ వయసున్న ఆడవారికి అట్రాక్ట్ అవుతున్న అబ్బాయిలు?
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో