Asifabad: కుక్క కరిచిన గేదె పాలు తాగిన గ్రామస్తులు భయంతో ఆస్పత్రి వద్దకు పరుగులు పెట్టారు. పాలు తాగిన 302 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను వేయించుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.